
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈనగరానికేమైంది సినిమా తో హీరో గా పరిచయమైనా నటుడు విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకోగా అయన హీరోగా చేసిన హిట్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.. కాగా అయన ప్రస్తుతం చేస్తున్న పాగల్ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూడసాగారు ప్రేక్షకులు..

నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విష్వక్ సేన్ సరసన సిమ్రన్ చౌదరి .. నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వస్తే నిర్మాతలు ఖండించారు. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నామని స్పష్టం చేశారు.

అయితే ఇప్పుడు వచ్చే నెల నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అలా థియేటర్లు ఓపెన్ అయితే, ముందుగా ప్రేక్షకులను పలకరించే సినిమాల జాబితాలో 'పాగల్' ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. థియేటర్లు తెరుచుకున్న కొన్ని రోజులకు ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో విష్వక్ సేన్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.