మంచు లక్ష్మీకి సినిమాలతో పాటు ఆరోగ్యం అంటే కూడా చాలా శ్రద్ద. ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తెలుగు
ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కెరీర్ తో కొనసాగుతూ ఉంది. స్టార్ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కూడాయాక్టివ్ గా వుంటుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్లో అప్ టూ డేట్
ఉంటారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విశేషాలను అందులో పోస్ట్ చేస్తుంటారు. అలాగే మంచు లక్ష్మీ కూడా తనకు సంబందించిన విషయాలు తన అభిమానులతో పంచుకుంటుంది. తన జిమ్ యోగా ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోస్ అలాగే తన ఫ్యాషన్ ఫోటోస్ అన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంటూ చాలా యాక్టివ్ గా వుంటోంది. తాజాగా మంచు లక్ష్మీ సైక్లింగ్ చేస్తున్న ఫోటో పెట్టింది. సన్ గ్లాసెస్ తో స్పోర్ట్స్ డ్రెస్స్ లో మంచు లక్ష్మీ అదిరిపోయో లుక్ తో దర్శనమిచ్చింది. దానికి సంబంధించిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శిల్పారెడ్డి తో కలిసి ఈ డ్రైవ్ కి వెళ్ళింది. కొంపల్లి నుండి రెహబ్ సెంటర్ వరకు ఈ రైడ్ జరిగింది. ఈ రైడ్ చాలా హ్యాపీగా ఉందని మంచు లక్ష్మీ పేర్కొంది.