#Prabhas in #SALAAR
— Hombale Films (@hombalefilms) December 2, 2020
THE MOST VIOLENT MEN.. CALLED ONE MAN.. THE MOST VIOLENT!!
Revealing our next Indian Film, an Action Saga.@VKiragandur @prashanth_neel pic.twitter.com/RqaIPwSUiB
రెబెల్ స్టార్ ప్రభాస్ దూకుడు మాములుగా లేదు. వరసగా సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ చేస్తోన్న ప్రభాస్, ఆ తర్వాత నుండి చాలా బిజీగా మారనున్నాడు. మొదటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేసాడు ప్రభాస్. అయితే అది కొంచెం వెనక్కు వెళ్ళి మధ్యలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చెప్పిన కథకు ఎస్ చెప్పాడు. ‘ఆది పురుష్’ అనే టైటిల్ కూడా అనౌన్స్ అయింది. ఇక ఇప్పుడు మరో సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అందరూ అనుకుంటున్నట్లు గానే కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా చేయనున్నాడు. కే.జి.ఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను కూడా నిర్మించనుంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇది ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పోస్టర్ ను చూస్తే అర్ధమవుతోంది. పూర్తి వయొలెన్స్ తో ఈ సినిమా నిండిపోనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.