
టాలివుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరూ సన్నిహితంగానే ఉంటారు. ఇటీవల కాలంలో ఒకరి సినిమా ఫంక్షన్ లకి మరొకరు వెళ్తూ ఫ్యాన్స్ కి మేమంతా ఒకటే అని, సామరస్యంగా ఉండండి అని చెప్తున్నారు. ఈ తరం హీరోల్లో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చాలా సన్నిహితంగా ఉంటారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ లు చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ మొన్నటి వరకూ బయటకు అంతగా కనిపించలేదు. తన సినిమా రిలీజ్ ఈవెంట్ లో మహేష్ మేము మేము బానే ఉంటాము మా కోసం మీరు ఎందుకు కొట్టుకుంటారు అని వారి మధ్య ఉన్న అనుబంధాన్ని బహిరంగంగా చెప్పారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి సినిమా కూడా చేస్తున్నారు. వీలైనప్పుడల్లా తారక్, చరణ్ లు కలిసి బయట పార్టీలు అవి చేసుకుంటుంటారు. ఆర్.ఆర్.ఆర్ మొదలైనప్పటి నుండీ వీరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది. ఇక వీరితో పాటు చిరంజీవి, నాగార్జునలు కూడా చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. అప్పట్లో ఎలక్షన్స్ కి ఇద్దరూ కలిసి వెళ్ళి వోట్ వేసి వచ్చారు అలాగే, లాక్ డౌన్ లో ఉన్నప్పుడు కూడా పరిశ్రమ తరపున వీరిద్దరూ వెళ్ళి షూటింగ్స్ చేసుకువడానికి అనుమతి కోసం మంత్రివర్గంతో చర్చలు జరిపారు.
A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets 🙏 picture courtesy Surekha garu 😊 pic.twitter.com/86FO5aWI1Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021
ఇక నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా టీజర్ చూసిన చిరు చాలా బాగుందని, దాన్ని ప్రమోట్ చేసారు. అలాగే ఈ మధ్య వీరిద్దరూ బయట బానే కనిపిస్తున్నారు. నాగర్జునగారు మెగాస్టార్ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయనతో కాసేపు సరదాగా ముచ్చటించి చిరు చేసిన డిన్నర్ ని ఆరగించారు. దీనికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ “వైల్డ్ డాగ్ రిలీజ్ కి నర్వస్ గా ఉండటంతో మెగాస్టార్ ని కలవడానికి వచ్చాను, అయన నన్ను తన మాటలతో, తన చేతి వంటతో కూల్ చేసేశారు” అని పోస్ట్ చేసారు. అన్నట్లు ఈ ఫోటో తీసింది ఎవరో తెలుసా చిరంజీవి సతీమణి సురేఖ గారు.