
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలు బయటపెట్టే వీలు లేదు. అసలు ఆ ఆలోచన వచ్చినా కరోన గురించిన వార్తలు వింటుంటే వెన్నులో వణుకు పుడుతోంది. మన ఇంట్లో వాళ్లకి ఈ వ్యాధి సోకితేనే ఆమడ దూరంలో ఉంటున్నాము. అలాంటిది ఎటువంటి సంబంధం లేకపోయినా మన పక్కనే ఉండి మనకు ట్రీట్మెంట్ ఇస్తూ అనుక్షణం మనల్ని కనిపెడుతూ ఉండే నర్సులు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఇక నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామన్యుల నుండి సెలబ్రిటీల వరకూ అందరూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
The COVID-19 second wave has been a challenging ordeal for all of us. Let's all be responsible. I urge you all to stay home and follow the lockdown protocols in our state. 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) May 12, 2021
ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. తన ట్విటర్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేసారు. “కరోనా లాంటి దారుణమైన పరిస్థితుల్లో ముందుండి సేవలందిస్తున్న వారందరికీ కృతఙ్ఞతలు. మీరు చేస్తున్న సేవలకు ఏదీ సాటి రాదు. మమ్మల్ని ఆదరించి, ఎంతో నిబద్ధతో, ధైర్యంతో ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న మీకు థ్యాంక్స్. మీ వల్లే ఆశలు ఇంకా బతికి ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ మీ వెంట మేముంటాం, మీకు సపోర్ట్గా నిలుస్తాం. కరోన సెకండ్ వేవ్ అనేది మనందరికీ ఓ సవాల్ వంటిది, మనమంతా బాధ్యతగా ఉందాం మన రాష్ట్రాల్లోని లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను” అని మహేష్ బాబు అన్నారు.

ఇక ప్రస్తుతం ఆయన పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన రెండు ప్రాజెక్ట్లను కమిట్ అయ్యారు. ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కాగా మరొకటి త్రివిక్రమ్ దర్శకత్వంలోది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకుండా ఉన్నాము. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి.