
తాజాగా ఏక్ మినీ కథ సినిమా తో సూపర్ హిట్ కొట్టిన సంతోష్ శోభన్ ఆ వెంటనే మరో సినిమా ని అనౌన్స్ చేశాడు. ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ హీరోపైనే ఉంది. ఇప్పటికే మూడు పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయడానికి సంతోష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఇక ఆ సినిమాల కంటే ముందుగా సారంగ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా అభిషేక్ మహర్షి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంతోష్ శోభన్ హీరోగా ఆయన 'ప్రేమ్ కుమార్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది కూడా పూర్తిగా వినోదభరితమైన కథాకథనాలతో నడిచేదే. రాశి సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇంతవరకూ 80 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న హీరో .. ఒక చేతిలో తాళి .. మరో చేతిలో భూతద్దం పట్టుకుని కనిపిస్తున్నాడు. దీనిని బట్టే ఇది కామెడీ పాళ్లు ఎక్కువున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది.