
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ రాణిస్తున్న హీరోయిన్ లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఉన్న సమయంలో ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేయడం అందరిని ఆశ్చర్యం కలిగించింది.. స్టార్ హీరోలందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ వరుస అవకాశాలు పొందగా ఆమెకు అక్కడ ఓ భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

నిజానికి బాలీవుడ్ చుట్టూ రకుల్ ప్రదక్షిణ చేస్తుంటే, ఇక్కడ ఆమెకి గల ప్లేస్ చేజారిపోయింది. ఒక్కసారిగా తెలుగులో రకుల్ కి సినిమాలు తగ్గిపోయాయి. ఇక తమిళంలో ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు గనుక, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు. అయితే బాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోతే రకుల్ పని అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు.

కానీ బాగానే బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు అక్షయ్ కుమార్ జోడీగా చేసే ఛాన్స్ కొట్టేసింది. రంజిత్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. శ్రద్ధా కపూర్ .. కియారా అద్వానీని దాటుకుని ఈ ఛాన్స్ రకుల్ కి రావడం విశేషం.