
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా పై అంచనాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు ఉండేలా చేసిన సుకుమార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డా కూడా ఈ సినిమా పై క్రేజ్ ప్రేక్షకుల్లో అలానే ఉంది. రెండు పార్ట్ లు గా ఈ సినిమా విడుదలవుతుండగా మొదటి పార్ట్ ను దసరా బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా వార్తలు వస్తున్నాయి. 17.5 కోట్లకు ఈ సినిమా హిందీ అనువాద హక్కులను అమ్మేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది కేవలం 'పుష్ప' మొదటి భాగానికి సంబంధించిన అనువాద హక్కుల నిమిత్తం మాత్రమే. 'పుష్ప' రెండవ భాగం హక్కులకి సంబంధించిన ఆలోచన ఆ సినిమా పూర్తయిన తరువాతనే చేస్తారు.

వచ్చే ఏడాదిలోనే రెండవ భాగం షూటింగు మొదలవుతుంది. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించిన బోట్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. తెలుగు తెరపై ఇంతవరకూ చూడని కొత్త పద్ధతిలో ఈ ఫైట్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.