
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో తను కూడా పాన్ ఇండియా రేంజ్ హీరో అనిపించుకో బోతున్నాడు.. దీంతో తన తదుపరి చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు ఎన్టీఆర్.. కొరటాల శివ ఆచార్య సినిమాని పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడట అయితే ఆచార్య తరువాత కొరటాల అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అయితే ఎన్టీఆర్ లాక్ ఆవడంతో ఆ సినిమా కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది..

మధ్యలో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఇలా కెరీర్ ని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్ కు పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదని అర్థం అవుతోంది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. మే నెలలో ఈ మూవీ షూటింగ్ అయిపోతే జూన్ లో కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అలానే ప్యారలల్ గా 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో చేయడానికి జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్టీఆర్ ప్లాన్ ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ట్రిపుల్ ఆర్ షూట్ ఇప్పటికే నిలిచిపోగా.. మహమ్మారి వైరస్ కారణంగా 'ఎవరు మీలో..' షో కోసం కంటెస్టెంట్స్ ని తీసుకురాడానికి ఛానెల్ వారు చాలా కష్టపడాల్సి వస్తోందట. దీంతో ప్రస్తుతానికి ఈ షో వాయిదా వేయాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది.