
యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ
చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో
ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ
నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్
కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి "ఓ మనసా" అనే లిరికల్ పాటను విడుదల
చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్
కంపోజ్ చేసి పాడారు. ఓ యువ జంట పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి
పెళ్లయ్యే దాకా సాగే సందర్భాలన్నీ ఈ పాటలో అందంగా చూపించారు. నా కథలే
మలుపే తిరిగే, నీ మహిమే జరిగే.. నా కనులా నిదురే తరిగే...నీ కలలే
పెరిగే..అంటూ బ్యూటిఫుల్ లిరిక్స్ తో సాగుతుందీ పాట.
ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన
వస్తోంది.యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ఈ
సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.