'జిలేబి' అందరికీ నచ్చే ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : జిలేబి ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్!!

సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు హీరో విక్టరీ వెంకటేష్ 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని గ్రాండ్ గా విడుదల చేశారు.  

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నిజంగా స్వీట్ అకేషన్. సినిమా కూడా జిలేబి లా స్వీట్ గా ఉంటుందని నాకు నమ్మకం వుంది. విజ‌య‌భాస్కర్ గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి చిత్రాలు ఆయన ఎంతో చక్కగా తీశారో మనకి తెలుసు. జిలేబి తప్పకుండా ఒక ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్ముతున్నాను. నటుడిగా పరిచయం అవుతున్న కమల్ కి ఆల్ ది బెస్ట్. శివాని, కమల్ ఇద్దరూ మంచి పాత్రలతో అలరిస్తారనే నమ్మకం వుంది.  నిర్మాతలు రామకృష్ణ, అంజులకు ఆల్ ది బెస్ట్. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది'' అన్నారు.

డర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేసిన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. ఆయన చేతుల మీదగా మా అబ్బాయి లాంచ్ అవ్వడం నాకు ఎంతో సంతోషం. జిలేబి విషయానికి వస్తే..రామకృష్ణ గారు, అంజు గారితో ఇది నా మొదటి కొలాబరేషన్. షూటింగ్ ఎలా స్టార్ అయ్యిందో ఎలా ఫినిష్ అయ్యిందో తెలియకుండానే అయిపొయింది. ఇది బ్యూటీఫుల్ జర్నీ. టీం అంతా ఎంతో సపోర్ట్ గా వున్నారు. అందుకే ఇంత ఫాస్ట్ గా చేయగలిగాం. మణిశర్మ గారు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సతీష్ చాలా చక్కని విజువల్స్ ఇచ్చారు. అంతా ఒక కుటుంబంలా కలసి ఈ సినిమా చేశాం. సినిమా ఎలా వుందో మీరు చూసి చెప్పాలి'' అన్నారు.  

శ్రీకమల్ మాట్లాడుతూ.. వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. అందరూ సినిమా చూసి మనసారా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. నిర్మాతలకు, టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు  

శివాని మాట్లాడుతూ.. జిలేబి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. కమల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. విజయ్ భాస్కర్ గారు నా ఫేవరేట్ డైరెక్టర్. అందరూ తెలిసిన వారితో పని చేయడం చాలా అనందంగా వుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ పని చేశాను'' అన్నారు

నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. షూటింగ్ దాదాపు పూర్తయింది. మిగిలిన రెండు పాటలని ఫారిన్ లో షూట్ చేయబోతున్నాం. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం'' అన్నారు.  

అంజు మాట్లాడుతూ.. విజయ్ భాస్కర్ లాంటి దర్శకులతో మొదటి సినిమా నిర్మాతగా చేస్తున్నందుకు చాలా అనందంగా వుంది. సినిమా చాలా ఫన్ గా వుంటుంది. తొందరలోనే ఈ సినిమా ముందుకు వస్తుంది'' అన్నారు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.